వచ్చే వారంలో రెండేళ్ల నుంచి ఆరేళ్ల చిన్నారులపై కోవాగ్జిన్ ట్రయల్స్!

ABN , First Publish Date - 2021-07-26T15:35:19+05:30 IST

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెండు నుంచి ఆరేళ్ల చిన్నారులకు...

వచ్చే వారంలో రెండేళ్ల నుంచి ఆరేళ్ల చిన్నారులపై కోవాగ్జిన్ ట్రయల్స్!

ఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెండు నుంచి ఆరేళ్ల చిన్నారులకు కోవాగ్జిన్ రెండవ డోసు ఇవ్వనున్నారు. ఆరు నుంచి 12, పన్నెండు నుంచి 18 ఏళ్ల చిన్నారులకు రెండవ డోసు టీకా వేయనున్నారు. సెప్టెంబరు నాటికి ట్రయల్స్ ఫలితాలు రానున్నాయిని నిపుణులు భావిస్తున్నారు. ఎయిమ్స్‌కు చెందిన వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నారులకు వారి వయసును అనుసరించి మూడు దశల్లో టీకాలు ఇవ్వనున్నారు. 


ముందుగా 12 నుంచి 18 ఏళ్ల చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్ జరిగాయి. ఆ తరువాత ఆరు నుంచి 12 ఏళ్ల చిన్నారులపై ట్రయల్స్ జరిగాయి. ఇప్పుడు చివరిగా రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసు కలిగిన చిన్నారులపై టీకా ట్రయల్స్ జరుగుతున్నాయి. దీనిలో భాగంగా వచ్చే వారంలో రెండు నుంచి ఆరేళ్ల చిన్నారులకు కోవాగ్జిన్ రెండవ డోసు ట్రయల్స్ కోసం ఇవ్వనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు దేశంలోని ఆరు కేంద్రాలలో 575 మంది చిన్నారులపై కరోనా వ్యాక్సీన్ పరీక్షలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే చిన్నారులకు తొలి డోసు వ్యాక్సీన్ ఇచ్చారు. త్వరలోనే వారికి రెండవ డోసు వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం ఇవ్వనున్నారు. 


Updated Date - 2021-07-26T15:35:19+05:30 IST