మంత్రి ప్రచారంలో జెండాలు మోసిన బాలలు

ABN , First Publish Date - 2021-11-11T01:32:11+05:30 IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పురపాలక సంఘ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు బుధవారం బాలలతో వైపీపీ జెండాలు మోయించటం కలకలం రేపుతుంది.

మంత్రి ప్రచారంలో జెండాలు మోసిన బాలలు

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పురపాలక సంఘ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు బుధవారం బాలలతో వైపీపీ జెండాలు మోయించటం కలకలం రేపుతుంది. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సాక్షిగా ప్రచారంలో పిల్లలు జెండాలను తిప్పుతూ పాల్గొన్నారు. స్థానిక వాసవీ మార్కెట్‌ వీధిలో మునిసిపల్‌ చైర్మన్‌ అభ్యర్ధి రంగాపురం రాఘవేంద్ర, పట్టణ వైసీపీ అధ్యక్షుడు చౌడవరపు జగదీష్‌లతో కలిసి ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. పిల్లలో జెండాలు మోయించడం విమర్శలకు దారితీసింది.

Updated Date - 2021-11-11T01:32:11+05:30 IST