క్రేన్ ఢీకొని చిన్నారి మృతి
ABN , First Publish Date - 2021-01-25T05:31:11+05:30 IST
క్రేన్ ఢీకొని చిన్నారి మృతి
నందిగామ: క్రేన్ ఢీకొని చిన్నారి మృతి చెందిన సంఘటన స్థానిక పోలీసుస్టేషన్ పరిధి అయ్యప్ప ఆలయ సమీపంలోని జంగోనిగూడ రహదారిపై ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బీహార్ రాష్ర్టానికి చెందిన కమలేష్ కొన్నేళ్ల క్రితం కుటుంభసభ్యులతో వలస వచ్చి నందిగామ పారిశ్రామిక వాడలోని కాటన్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతని కూతురు ఖుషి(6) ఇంటికి సమీపంలోని జంగోనిగూడ రోడ్డు ప్రక్కన ఆడుకుంటుండగా అటువైపుగా వెళ్తున్న క్రేన్ పాపను ఢీకొంది. దీంతో పాప తల పగిలి అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ అసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి కుసుందేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపారు.