ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి
ABN , First Publish Date - 2021-04-17T05:22:11+05:30 IST
ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి చెందిన సంఘటన శుక్రవా రం కత్తవపాడులో జరిగింది.
ఇరగవరం, ఏప్రిల్ 16: ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి చెందిన సంఘటన శుక్రవా రం కత్తవపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కత్తవపాడు గ్రామానికి చెందిన కొండ్రెడ్డి నాగరాజు రెండో కుమార్తె తేజశ్రీ(11) అదే గ్రామంలో 5వ తరగతి చదువుతోంది. శుక్రవారం స్నేహితురాలితో కలిసి సైకిల్పై వెళుతుండగా మార్గమధ్యలో ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్ ఒక్కసారిగా వెనుకకు రావడంతో తేజశ్రీ సైకిల్ ట్రాక్టర్ చక్రం కింద ఇరుక్కుపోయింది. సైకిల్ పైనుంచి రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయమై రక్తస్రావంతో పడి ఉన్న తేజశ్రీని స్థానికులు హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. బయటకు వెళ్లిన పాప శవమై తిరిగి రావడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పంచనా మా నిమిత్తం తణుకు జిల్లా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతిపై తాతయ్య జవ్వాది కనకదుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ పి.బి.ఎస్.ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.