నాలుగో అంతస్తు నుంచి పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2021-08-19T23:44:00+05:30 IST

అపార్టుమెంటులోని నాలుగో అంతస్తు నుంచి జారి పడి శాన్విత (22 నెలల) చిన్నారి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకొంది.

నాలుగో అంతస్తు నుంచి పడి చిన్నారి మృతి

మంచిర్యాల: అపార్టుమెంటులోని నాలుగో అంతస్తు నుంచి జారి పడి శాన్విత (22 నెలల) చిన్నారి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకొంది. ఏసీసీ కాలనీలోగల ఎస్‌ఆర్‌ రెసిడెన్సిలోని నాలుగవ అంతస్తులో కొండబత్తుల ప్రవీణ్‌కుమార్‌, వాణి దంపతులు నివాసముంటున్నారు. గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వారి కూతురు శాన్విత నిద్రలేచి బాల్కనీలోకి వచ్చింది. సిమెంట్‌ గ్రిల్స్‌ నుంచి కిందకు చూస్తుండగా ప్రమాదవశాత్తు జారి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పడింది. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో తల్లిదండ్రులు వచ్చి తీవ్రంగా గాయపడిన చిన్నారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రవీణ్‌కుమార్‌, వాణి దంపతులకు శాన్విత ఒక్కతే కూతురు. 

Updated Date - 2021-08-19T23:44:00+05:30 IST