చిన్నారి అదృశ్యం
ABN , First Publish Date - 2021-10-20T04:51:53+05:30 IST
జనరల్ ఆసుపత్రికి వచ్చిన ఓ చిన్నారి మిస్ అయ్యింది.
మహబూబ్నగర్, అక్టోబరు 19 : జనరల్ ఆసుపత్రికి వచ్చిన ఓ చిన్నారి మిస్ అయ్యింది. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగ డ్డకు చెందిన వెంకటేశ్ భార్య అం జమ్మ తన కూతురు చిట్టెమ్మ(8) ను తీసుకుని మంగళవారం వైద్యం చేయించుకునేందుకు జ నరల్ ఆసుపత్రికి వెళ్లింది. మధ్యాహ్నం 2 గంటలకు వైద్యం చేయించుకున్న అనంతరం కళ్లు తిరగడంతో ఆసుపత్రి ఆ వరణలోనే ఆమె కాసేపు సేదదీరారు. తరువాత చూసేసరికి కూ తురు చిట్టెమ్మ కనిపించకపోవడంతో భర్తకు ఫోన్ చేసి విష యం చెప్పింది. వెంటనే ఆయన అక్కడికి చేరుకొని ఇద్దరూ కలి సి వెతికినా కనిపించకపోవడంతో టుటౌన్ పోలీస్ స్టేషన్లో వెంకటేశ్ ఫిర్యాదు చేశారు. అదృశ్యమైందా, ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుల ఫి ర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్, కిడ్నాప్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.