నేడు వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు రాక

ABN , First Publish Date - 2022-08-20T06:11:52+05:30 IST

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించేందుకు శనివారం వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు రానున్నారు.

నేడు వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు రాక

కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 19: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగే అభివృద్ధి పనులను పరిశీలించేందుకు శనివారం వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు రానున్నారు. ఉదయం 9.45 గంటలకు డోన్‌కు చేరుకుని అక్కడ వంద పడకల ఏరియా ఆసు పత్రి నిర్ధారణ పనులను తనిఖీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలుకు చేరుకుని ప్రభుత్వ సర్వజన వైద్య శాలలో పలు నిర్మాణ పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు కర్నూలు మెడికల్‌ కాలేజీ కేన్సర్‌ కేర్‌ యూనిట్‌, న్యూడయోగ్నస్టిక్‌ సెంటర్‌, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ పనులను తనిఖీ చేయనున్నారు. ఈ మేరకు కర్నూలు మెడి కల్‌ కాలేజీ అధికారులు శుక్రవారం ప్రిన్సిపల్‌ సెక్రటరీ రానున్నట్లు అన్ని విభాగాల హెచ్‌వోడీలు, వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-08-20T06:11:52+05:30 IST