ఎంజీఆర్ పాటను బట్టీపడుతున్న ప్రధాని
ABN , First Publish Date - 2021-03-09T14:22:10+05:30 IST
దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ నటించిన చిత్రంలోని పాటను ప్రధాన నరేంద్ర మోదీ కంఠస్థం చేస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పలుమార్లు పర్యటించిన మోదీ తిరుక్కురళ్...
చెన్నై/పెరంబూర్ (ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ నటించిన చిత్రంలోని పాటను ప్రధాన నరేంద్ర మోదీ కంఠస్థం చేస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పలుమార్లు పర్యటించిన మోదీ తిరుక్కురళ్, తమిళ రచయితలు రాసిన మాటలను ఉటంకిస్తూ రాష్ట్రప్రజలను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. రాష్ట్రప్రజలకు మరింత దగ్గరయ్యేలా, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి విజయం సాధించేలా ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో, తన ప్రసంగంలో ఎంజీఆర్-జయలలిత నటించిన ప్రజాదరణ పొందిన పాట వుండాలని భావించిన ప్రధాని, ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి, ఆ పాటను బట్టీపడుతున్నట్లు సమాచారం.