హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2021-10-25T06:23:35+05:30 IST

సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదని సీఐటీయూ రాష్ట్ర అఽద్యక్ష,కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు విమర్శించారు.

హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి
సమావేశంలో మాట్లాడుతున్న మంద నరసింహారావు

- సింగరేణి సంస్థను కాపాడుకోవడం కోసం కార్మికులు ఉద్యమానికి సిద్ధం కావాలి

- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజారెడ్డి, నర్సింహారావు

గోదావరిఖని, అక్టోబరు 24: సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేరలేదని సీఐటీయూ రాష్ట్ర అద్యక్ష,కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి, మంద నరసింహారావు విమర్శించారు. ఆదివా రం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత సింగరేణి ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక హామిలు సొంత ఇంటి కల నెరవేరలేదని, కొత్త బొగ్గు గనులు రాలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం పాట వేయడానికి నిర్ణయించిందని, దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏమి మాట్లాడడం లేదని, సింగరేణి నిర్వీర్యం అవుతుంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలే ముఖ్యమయ్యాయని, కార్మికుల సమస్యలు పట్టించుకోపోవడం విడ్డూరంగా ఉందని, సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని విమర్శించారు. జెన్‌కో నుంచి రావాల్సిన రూ.12వేల కోట్లను ఇప్పటి వరకు చెల్లించలేదని, సింగరేణికి వచ్చిన లాభాలను ఇతర ప్రాంతాలకు తరలించుకుపోతూ సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం లేదని, రామగుండం ఏరియాలో కార్మిక కుటుంబాలకు మంచినీటి సరఫరా చేయలేని దుస్థితిలో సింగరేణి యాజమాన్యం ఉందని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి  కేసీఆర్‌పై ఉందని, బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నాలుగు బొగ్గు బ్లాకుల వేలం పాటలను ఆపాలని డిమాండ్‌ చేశారు. సింగరేణిని కాపాడుకోవడం కోసం కార్మికులు, కార్మిక సంఘాల ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాగరాజు, గోపాల్‌, కృష్టయ్య, మెండె శ్రీనివాస్‌, కారం సత్తయ్య, ఆసరి మహేష్‌, గజేందర్‌, వెంకన్న, ఉల్లి మొగిలి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, భాగ్యరాజ్‌ శ్రీనివాస్‌, రాజయ్య, రామస్వామి, ఐలయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T06:23:35+05:30 IST