నేడు శ్రీశైలానికి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
ABN , First Publish Date - 2021-06-18T08:17:27+05:30 IST
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శుక్రవారం శ్రీశైలం రానున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 8.45 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు
శ్రీశైలం, జూన్ 17: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శుక్రవారం శ్రీశైలం రానున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి 8.45 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామిని సీజేఐ దంపతులు దర్శించుకుంటారు. దర్శనం అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తారు.