భూసేకరణ చట్టంపై తీర్పు అయోమయం
ABN , First Publish Date - 2020-09-29T08:11:20+05:30 IST
భూసేకరణ, పరిహారం చెల్లింపుపై గతంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాస్త అయోమయంగా ఉందని, దీనిపై కొంత స్పష్టత కావాలని చీఫ్ జస్టిస్ శరద్ బోబ్డే నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది...
- పరిశీలించాలని సుప్రీం నిర్ణయం
న్యూఢిల్లీ: భూసేకరణ, పరిహారం చెల్లింపుపై గతంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాస్త అయోమయంగా ఉందని, దీనిపై కొంత స్పష్టత కావాలని చీఫ్ జస్టిస్ శరద్ బోబ్డే నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. ‘‘నా మదిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ఏళ్ల తరబడి ప్రభుత్వం సదరు భూమిని అట్టేపెట్టుకుని పరిహారం మాత్రం చెల్లించకుండా ఉంటే ఆ భూమిని ఇచ్చినవారు నష్టపోరా? ’’ అని సీజే బోబ్డే అన్నారు. దీనిపై బెంచ్లో ఉన్న మిగిలిన ఇద్దరు జడ్జీలు- జస్టిస్ ఏఎస్ బోప న్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్లతో సంప్రదించి రెండు వారాల తరువాత ఓ నిర్ణయానికి వస్తానన్నారు.