మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి : చిదంబరం
ABN , First Publish Date - 2020-09-26T22:40:54+05:30 IST
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ 88వ పుట్టిన రోజును పురస్కరించుకొని చిదంబరం పై వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ రోజు మన్మోహన్ సింగ్ పుట్టిన రోజు. మంచి ఆరోగ్యంతో దేశానికి మరి కొన్ని రోజులు సేవలు చేయాలని కోరుకుంటున్నా. ఆయన జీవితమంతా వినయపూర్వకంగా సాగింది. విద్యార్హతలు, మేధో సంపత్తితోనే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. దేశం మొత్తానికి ఆయన రోల్ మాడల్. జీవించి ఉన్న వారిలో ఎవరైనా భారత రత్నకు అర్హులంటే నిస్సందేహంగా మన్మోహన్ సింగే’’ అని చిదంబరం ట్విట్టర్ లో పేర్కొన్నారు.