రైతులకు మోదీ సర్కార్ ఇచ్చిన బహుమానం ఇదే : చిదంబరం

ABN , First Publish Date - 2021-02-27T22:16:39+05:30 IST

ఉద్యమిస్తున్న రైతుల విషయంలో ప్రధాని మోదీ వ్యవహరశైలిని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తప్పుపట్టారు. కరోనా లాంటి సంకట

రైతులకు మోదీ సర్కార్ ఇచ్చిన బహుమానం ఇదే : చిదంబరం

న్యూఢిల్లీ : ఉద్యమిస్తున్న రైతుల విషయంలో ప్రధాని మోదీ వ్యవహరశైలిని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తప్పుపట్టారు. కరోనా లాంటి సంకట కాలంలోనూ వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి రేటును సాధించిందని గుర్తు చేశారు. అలాంటి రైతులను శత్రువులుగా చిత్రీకరించి వారికి మోదీ సర్కార్ బహుమానం ఇచ్చిందని ఎద్దేవా చేశారు. మోదీ కేరళ నుంచి అసోం వరకూ వెళ్తారు కానీ... 20 కిలోమీటర్లు ప్రయాణించి రైతుల వద్దకు వెళ్లలేరని విమర్శించారు. నూతన సాగు చట్టాలతో రైతుల ఆదాయం రెండితలు అవుతుందని కేంద్రం పదే పదే చెబుతోందని, కనీస మద్దతు ధర అనేది కేవలం ఆరు శాతం రైతులకే అందుతోందని  చిదంరబం పేర్కొన్నారు. 


Updated Date - 2021-02-27T22:16:39+05:30 IST