పచ్చిమిర్చి కోడి పులావు

ABN , First Publish Date - 2020-09-19T18:31:39+05:30 IST

చికెన్‌ - ఒకకేజీ, బాస్మతి బియ్యం - ముప్పావు కేజీ, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - పావు టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కొత్తిమిర తరుగు -

పచ్చిమిర్చి కోడి పులావు

కావలసినవి: చికెన్‌ - ఒకకేజీ, బాస్మతి బియ్యం - ముప్పావు కేజీ, ఉల్లిపాయలు - రెండు,  పచ్చిమిర్చి - పావు టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, కొత్తిమిర తరుగు - అరకప్పు, పుదీనా తరుగు - అరకప్పు,  అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు టీస్పూన్లు, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ధనియాల పొడి - రెండు టీస్పూన్లు, గరం మసాలా పొడి - పావు టీస్పూన్‌, పెరుగు - 100గ్రా., నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - రెండు టీస్పూన్లు. యాలకులు -  4 లవంగాలు - 5, , దాల్చిన చెక్క - అంగుళం ముక్క, షాజీరా - ఒక టీస్పూన్‌.


తయారీ: చికెన్‌ ముక్కలు కడిగి జల్లెడలో వేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, తాజా గరంమసాలా దినుసులు వేసి మెత్తగా గైరండ్‌ చేసుకోవాలి. మందపాటి గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేగించాలి. ఎర్రగా వేగిన కొన్ని ఉల్లిపాయలు తీసి పక్కనపెట్టుకోవాలి. ఉల్లిపాయలలో నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి ముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు వేసి కొద్దిసేపు వేగించాలి. చికెన్‌ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలన్నీ నూనెలో మగ్గి, వేగిన తర్వాత పెరుగు వేసి కలిపి అరకప్పు నీళ్లు పోసి చిన్న మంట మీద ఉడకనివ్వాలి. బాస్మతి బియ్యం కడిగి నీళ్లు పోసి పదిహేను నిమిషాలు నాననివ్వాలి. వేరే పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. ఇందులో  యాలకులు, లవంగాలు, దాల్చిన, షాజీర వేసి బియ్యానికి తగిన ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్ల నుంచి బియ్యం తీసి వేయాలి. బియ్యం ముప్పావు వంతు ఉడకగానే దింపేసి జల్లెడలో వేయాలి. చికెన్‌ ఉడుకుతుండగానే బియ్యం రెడీ చేసుకోవాలి. తడి ఆరకూడదు. చికెన్‌ ఉడికిన తర్వాత ఈ ఉడికిన బియ్యం వేసి పైన ఎర్రగా వేగించిన ఉల్లిపాయలు, నెయ్యి వేసి మూత పెట్టాలి. మీడియం మంట మీద మరో పది నిమిషాలు ఉంచి తర్వాత దింపేసి వడ్డించుకోవాలి.


Updated Date - 2020-09-19T18:31:39+05:30 IST