rains: చెదురుమదురు వర్షాలు

ABN , First Publish Date - 2022-08-22T02:24:12+05:30 IST

రెండు రోజుల కిందట ఒడిశాలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం ఆదివారం నాటికి బలహీనపడి వాయుగుండంగా మారి ఛత్తీస్‌గఢ్‌

rains: చెదురుమదురు వర్షాలు

విశాఖపట్నం: రెండు రోజుల కిందట ఒడిశాలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం ఆదివారం నాటికి బలహీనపడి వాయుగుండంగా మారి ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ (Chhattisgarh Madhya Pradesh) ప్రాంతంలో కొనసాగుతోంది. సోమవారం నాటికి ఇది మరింత బలహీనపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే వాయుగుండం రాష్ట్రానికి దూరంగా ఉండడం, నైరుతి రుతు పవనాలు బలహీనంగా మారడంతో ఒక్కసారిగా వర్షాలు తగ్గాయి. అనేక చోట్ల ఆకాశం నిర్మలంగా ఉండడంతో పాటు ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆదివారం తిరుపతిలో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు అనేక చోట్ల వాతావరణ అనిశ్చితి నెలకొని, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Updated Date - 2022-08-22T02:24:12+05:30 IST