మెదక్‌ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

ABN , First Publish Date - 2020-02-20T07:20:41+05:30 IST

మెదక్‌ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

మెదక్‌ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

మెదక్‌ అర్బన్‌, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ జయంతిని మెదక్‌ జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ పట్టణ అధ్యక్షుడు మాల్కజి సత్యనారాయణ మాట్లాడుతూ ధర్మపరిరక్షణకు అందరూ కంకణబద్దులు కావాలన్నారు. వీహెచ్‌పీ నాయకులు చెన్న రాంచంద్రం, నాయిని ప్రసాద్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాంచరణ్‌యాదవ్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం శ్రీనివాస్‌, సుమన్‌, విజయ్‌, కాస కిట్టు, అప్పల సునీల్‌, దుర్గారాజ్‌, సాయి, సతీష్‌, మాయ శంకర్‌, వనపర్తి వెంకటేశం పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-20T07:20:41+05:30 IST