దేవుడి పేరుతో రాజకీయాలు చేసేవాళ్లు దరిద్రులు: చెవిరెడ్డి

ABN , First Publish Date - 2020-09-18T22:24:23+05:30 IST

దేవుడ్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే వాళ్లంతా దరిద్రులు అంటూ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవుడ్ని అడ్డం

దేవుడి పేరుతో రాజకీయాలు చేసేవాళ్లు దరిద్రులు: చెవిరెడ్డి

తిరుపతి: దేవుడ్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే వాళ్లంతా దరిద్రులు అంటూ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేవుడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు. దేవుడే లేడన్న డీఎంకే పార్టీని అత్యంత భక్తి గల తమిళులు గెలిపించారని గుర్తుచేశారు. శ్రీవారి దర్శనం తర్వాతే జగన్ పాదయాత్రను  ప్రారంభించారని తెలిపారు. అలాగే పాదయాత్ర ముగింపు తర్వాత కూడా తిరుమలకు వచ్చారని వెల్లడించారు. మిరాశీ వ్యవస్థను చట్టం చేసి న్యాయం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. జంధ్యం వేసుకోని బ్రహ్మణుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అని చెప్పారు. తాను చంద్రబాబు‌కు సవాలు చేస్తున్నా.. వైవీ సుబ్బారెడ్డి కుటుంబానికి ఉన్న భక్తిలో పది శాతం కూడా చంద్రబాబు కుటుంబంలో ఉండదని చెప్పుకొచ్చారు. పింక్ డైమండ్ వ్యవహారంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరినీ వైసీపీ ప్రభుత్వం వదిలి పెట్టదన్నారు. తప్పుచేసిన వారిపై చర్యలు ఉంటాయని చెవిరెడ్డి హెచ్చరించారు.

Updated Date - 2020-09-18T22:24:23+05:30 IST