కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలి: చెవిరెడ్డి
ABN , First Publish Date - 2021-05-05T15:34:07+05:30 IST
కరోనా నియంత్రణకు..
తిరుపతి: కరోనా నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న కార్ఫ్యూకు ప్రజలంద రూ సహకరించాలని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేం దుకు కర్ఫ్యూ దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇళ్ల నుంచి ఎవరూ వెలుపలికి రావొద్దని విజ్ఞప్తి చేశా రు. అత్యవసర పనుల మీద వెలుపలికి వస్తే మాస్కు ధరించాలని కోరారు. ఇక తరచూ శానిటైజర్ను వినియోగిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. కరోనా తీవ్రత పెరిగిందనీ, అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ ఇంటి నుంచి ఎవ్వరూ బయటికి రావొద్దని కోరారు.