కరోనా బాధితులకు చెవిరెడ్డి అండ

ABN , First Publish Date - 2021-05-09T08:35:12+05:30 IST

‘‘మీరు అధైర్యపడొద్దు, మీకు అండగా నేనుంటా’’నంటూ కరోనా బాధితులకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి భరోసా కల్పించారు. తిరుపతి సమీపంలోని తిరుచానూరు పద్మావతి నిలయం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఆయన శనివారం

కరోనా బాధితులకు చెవిరెడ్డి అండ

తిరుచానూరు, మే 8: ‘‘మీరు అధైర్యపడొద్దు, మీకు అండగా నేనుంటా’’నంటూ కరోనా బాధితులకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి భరోసా కల్పించారు. తిరుపతి సమీపంలోని తిరుచానూరు పద్మావతి నిలయం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఆయన శనివారం సందర్శించారు. కరోనా బాధితులతో మాట్లాడారు. ఆక్సిజన్‌ బెడ్లపై అత్యవసర సేవలు పొందుతున్న కరోనా బాధితులను పరామర్శించారు. ధైర్యంతోనే కరోనాను జయించవచ్చని ఈ సందర్భంగా చెవిరెడ్డి కరోనా బాధితుల్లో భరోసా కల్పించారు. అనంతరం ఆయన బాధితులకు ఆహారం పంపిణీ చేశారు.

Updated Date - 2021-05-09T08:35:12+05:30 IST