చెస్ విజేత చిద్విలాస్
ABN , First Publish Date - 2021-07-15T17:57:42+05:30 IST
జాతీయ స్థాయి స్కూల్ ఓపెన్ చెస్ పోటీల్లో తెలంగాణకు చెందిన చిద్విలాస్ సాయి సూరపనేని
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి) : జాతీయ స్థాయి స్కూల్ ఓపెన్ చెస్ పోటీల్లో తెలంగాణకు చెందిన చిద్విలాస్ సాయి సూరపనేని చాంపియన్గా నిలిచాడు. అండర్-13 బాలుర విభాగంలో చిద్విలాస్ 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకొన్నాడు. అర్హన్ చేతన్ ఆనంద్ (కర్ణాటక), వేదాంత్ నితిన్ (మహారాష్ట్ర) రెండు, మూడు స్థానాలు దక్కించుకొన్నారు. ఈ టోర్నీ విజేతగా నిలవడంతో చిద్విలా్సకు ఈ నెల 29 నుంచి 31 వరకు జరుగనున్న ఆసియా స్థాయి పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. అలాగే ఆగస్టులో జరుగనున్న ప్రపంచ స్థాయి పోటీల్లోనూ పాల్గొననున్నాడు. కాగా, బాలికల విభాగంలో పౌర్ణమి 8 పాయింట్లతో టాప్లో నిలిచింది.