Cash prize: చెస్ క్రీడాకారులు, కోచ్లకు నగదు బహుమతి
ABN , First Publish Date - 2022-07-30T16:27:16+05:30 IST
చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం(Mahabalipuram) వేదికగా 44వ చెస్ ఒలంపియాడ్ పోటీలు ఈ నెల 28వ తేదీ
అడయార్(చెన్నై), జూలై 29: చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం(Mahabalipuram) వేదికగా 44వ చెస్ ఒలంపియాడ్ పోటీలు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో నగరంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన వేళమ్మాల్ విద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు, కోచ్లు పాలుపంచుకుంటున్నారు. ఈ గ్లోబెల్ ఈవెంట్లో భారత జట్టు తరపున ఆడే క్రీడాకారుల్లో వేళమ్మాల్ విద్యాలయానికి చెందిన అభిదన్ భాస్కరన్, ఎస్.పి.సేతురామన్, కార్తికేయన్ మురళి, ఆర్.వైశాలి, ప్రఙ్ఞానంద ఆర్.గుకేష్ ఉన్నారు. వీరితో పాటు ఈ చెస్ పోటీల్లో పాల్గొనే భారత క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసిన కోచ్ల్లో ఈ విద్యాలయానికి చెందిన నారాయణన్ శ్రీనాథ్, శ్యామ్ సుందర్, ప్రియదర్శన్(Priyadarshan) ఉన్నారు. వీరిని ప్రోత్సహించేలా రూ.30 లక్షల నగదు బహుమతిని వారికీ అందజేశారు. ఆలప్పాక్కంలోని వేళమ్మాల్ విద్యాలయలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణ్యం పాల్గొని నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కారప్పాక్కం ఎమ్మెల్యే గణపతి(Ganapati), పారిశ్రామికవేత్త సీకీఏ కుమారవేల్, భగవాన్ సైబర్టాక్ గ్లోబల్ సీవోవో మైక్ మురళీధరన్, చెన్నై డిస్ట్రిక్ట్ చెస్ ఫెడరేషన్ సెక్రటరీ గణేశన్, చెస్ కోచ్ రమేష్, వేళమ్మాల్ నెక్సస్ కరప్పాండెంట్ ఎంవీఎం వేల్మోహన్ తదితరులు పాల్గొన్నారు.