closing ceremony: చెస్ ఒలంపియాడ్ ముగింపు వేడుకలకు రాష్ట్రపతి?
ABN , First Publish Date - 2022-07-31T14:07:18+05:30 IST
చెస్ ఒలంపియాడ్ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
పెరంబూర్(చెన్నై), జూలై 30: చెస్ ఒలంపియాడ్ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో 44వ చెస్ ఒలంపియాడ్(Chess Olympiad) పోటీలను నెహ్రూ స్టేడియంలో ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం స్థాయిలోనే ఆగస్టు 10వ తేది ముగింపు వేడుకలు(closing ceremonies) నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఈ వేడులకు ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.