క్రీడలపై విద్యార్థులు ఆసక్తి చూపాలి

ABN , First Publish Date - 2022-05-17T05:32:57+05:30 IST

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని సబ్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ అన్నారు.

క్రీడలపై విద్యార్థులు ఆసక్తి చూపాలి
బ్రోచర్‌ విడుదల చేస్తున్న సబ్‌ కలెక్టర్‌

నరసాపురం టౌన్‌, మే 16: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి చూపాలని సబ్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ అన్నారు. నూలి సాయి అభయ్‌ మెమోరియల్‌ పేరిట ఈ నెల 28న నిర్వహించే చెస్‌ పోటీల బ్రోచర్లను సోమవారం ఆయన అవిష్కరించారు. ఐదేళ్లుగా జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వాసవి క్లబ్‌ అధ్యక్షుడు సుబ్బారావు, పాండురంగారావు, మాస్టర్‌ చెస్‌ అకాడమి ఆర్‌కె.వర్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T05:32:57+05:30 IST