నకిలీ ఆర్‌ఎంపీపై కేసు

ABN , First Publish Date - 2021-04-21T06:18:10+05:30 IST

నిబంధనలను ఉల్లంఘించి వైద్య సేవలందిస్తున్న చెరివి గ్రామం ఆర్‌ఎంపీపై తిరుపతి ఔషధ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు.

నకిలీ ఆర్‌ఎంపీపై కేసు
మందులను పరిశీలిస్తున్న డాక్టర్‌ కీర్తన

సత్యవేడు, ఏప్రిల్‌ 20: నిబంధనలను ఉల్లంఘించి వైద్య సేవలందిస్తున్న ఓ నకిలీ ఆర్‌ఎంపీపై తిరుపతి ఔషధ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వివరాలివీ.. సత్యవేడు మండలం చెరివి గ్రామంలో గౌతమ్‌(సిద్ధయ్య) అనే వ్యక్తి క్లినిక్‌ నడుపుతున్నారు. ఆర్‌ఎంపీ పేరిట చలామణి అవుతూ అనుమతుల్లేకుండా వైద్యసేవలందిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో మంగళవారం తిరుపతి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కీర్తన గౌతమ్‌ క్లినిక్‌లో తనిఖీలు నిర్వహించారు. రూ.లక్ష విలువైన మందులను స్వాధీనం చేసుకుని, ఆస్పత్రిని సీజ్‌ చేశారు. నకిలీ ఆర్‌ఎంపీపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచినట్లు కీర్తన తెలిపారు. అనుమతుల్లేకుండా మందులు విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు నకిలీ వైద్యుల వద్ద చికిత్సలు చేయించుకోరాదని సూచించారు. 

Updated Date - 2021-04-21T06:18:10+05:30 IST