డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ABN , First Publish Date - 2021-10-20T05:00:31+05:30 IST
డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని సీఎం ప్రవేశపెట్టారని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.
జీలుగుమిల్లి, అక్టోబరు 19: డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వైఎస్సార్ ఆసరా పథకాన్ని సీఎం ప్రవేశపెట్టారని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. జీలుగుమిల్లి పి.అంకంపాలెం, జీలుగుమిల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బాలరాజు ప్రసంగించారు. మండలానికి రూ.3.13కోట్లు మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ పనులు పరిశీలించారు. పీహెచ్సీని సందర్శించారు. ఎంపీపీ కొర్స పోశమ్మ, జడ్పీటీసీ మల్లం వసంత్, కరాటం సీతాదేవి, బోదా శ్రీనివాసరెడ్డి, ఘంటసాల గాంధీ, కొల్లూరి రాంబాబు, సర్పంచ్లు, ఎంపీ టీసీలు ఎంపీడీవో నిమ్మగడ్డ బాలాజీ, సున్నం సురేష్ పాల్గొన్నారు.