రాత్రికి రాత్రే మారిపోయిన బ్రిడ్జి.. షాకవుతున్న Chennai వాసులు.. వీడియో వైరల్!
ABN , First Publish Date - 2022-07-17T22:23:22+05:30 IST
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ వంతెన రాత్రికి రాత్రే చెస్ బోర్డ్లా మారిపోయింది.
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ వంతెన రాత్రికి రాత్రే చెస్ బోర్డ్లా మారిపోయింది. దానిని చూసి స్థానికులు షాక్కు గురయ్యారు. చెన్నైలో నేపియర్ బ్రిడ్జి అనేది సమీప ప్రాంతాలకు ఓ ల్యాండ్ మార్క్. ఈ వంతెన శనివారం ఉదయం చూసేసరికి చెస్ బోర్డుగా మారిపోయింది. బ్రిడ్జి ఉపరితలంతో పాటు రెయిలింగ్ గోడలు కూడా Chess Board రంగుల్లోకి మారిపోయాయి. బ్రిడ్జి మొత్తం తెలుపు, నలుపు గళ్లతో నిండిపోయింది.
రాత్రికి రాత్రే ఇలా మారిపోయిన ఈ బ్రిడ్జి ఇప్పుడు చెన్నైవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ బ్రిడ్జి ఇలా మారిపోవడానికి ఓ కారణం ఉంది. తమిళనాడులోని మామళ్లాపురంలో జూలై 28 నుంచి చెస్ ఒలింపియాడ్ మొదలు కానుంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫైడ్) ఆధ్వర్యంలో జరగనున్న ఈ చెస్ ఒలింపియాడ్కు గుర్తుగా నేపియర్ బ్రిడ్జిపై పెయింట్ వేసి ఇలా చెస్ బోర్డ్లా మార్చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బ్రిడ్జిపై హాయిగా చెస్ ఆడుకోవచ్చని, చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.