టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై
ABN , First Publish Date - 2021-04-17T00:43:43+05:30 IST
ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లూ తొలి సారి ఈ సీజన్లో పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన చెన్నై..
ముంబై: ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జట్లూ తొలి సారి ఈ సీజన్లో పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో తాము కచ్చితంగా రాణించాలని భావిస్తున్నామని, ప్రాక్టీస్లో అద్భుతంగా ఆడామని, మ్యాచ్లో కూడా తమ ఆటగాళ్లు బాగారాణిస్తారని భావిస్తున్నానని అన్నాడు. ఇక రాహుల్ మాట్లాడుతూ.. గత మ్యాచ్లో బాగా ఆడామని, ఈ మ్యాచ్లో కూడా రాణించాలని కోరుకుంటున్నామని చెప్పాడు. ముంబైలో పిచ్లు అన్నీ ఒకేలా ఉంటాయని, పిచ్ను త్వరగా అర్థం చేసుకుని ఆడితే మంచి స్కోరు చేయడంపైనే దృష్టి సారిస్తామని చెప్పాడు. కాగా.. ఇరు జట్లు కూడా తొలి మ్యాచ్లో ఆడిన జట్లతోనే బరిలోకి దిగుతున్నాయి.