రూ.14 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-17T18:00:01+05:30 IST

చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న రూ.14 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పళ్లికొండ టోల్‌గేట్‌

రూ.14 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

చెన్నై/వేలూరు: చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న రూ.14 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పళ్లికొండ టోల్‌గేట్‌ వద్ద పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 4 గంటల కు వాహనతనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన లారీని అడ్డుకొని తనిఖీ చేయగా, రూ.14 లక్షల విలువైన గుట్కాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో బెంగుళూరుకు చెందిన వెంకటస్వామి, సేలంకు చెందిన మూర్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు బెంగుళూరు నుంచి చెన్నైకి గుట్కా తరిస్తున్నట్లు విచారణలో తేలింది.

Updated Date - 2021-05-17T18:00:01+05:30 IST