ఇంజన్ ఆయిల్ తాగి వృద్ధుడి మృతి
ABN , First Publish Date - 2021-05-17T17:23:30+05:30 IST
ఆర్కాడు సమీపం మేల్విశారంలో కుమార్ (64) రంజని (63) దంపతులు నివశిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా
చెన్నై/వేలూరు: ఆర్కాడు సమీపం మేల్విశారంలో కుమార్ (64) రంజని (63) దంపతులు నివశిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇంజన్ ఆయిల్ తాగితే కరోనా రాదని పలువురు చెప్పిన మాటలు నమ్మిన కుమార్, శనివారం సాయంత్రం ఇంజన్ ఆయిల్ తాగడంతో స్పృహ తప్పి పడిపోయాడు. చుట్టుపక్కల వారు అతడిని వేలూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స ఫలించక ఆదివారం ఉదయం మృతిచెందాడు. ఈ ఘటనపై ఆర్కాడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.