రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. మళ్లీ ఎల్బీడబ్ల్యూనే..!

ABN , First Publish Date - 2020-09-20T03:34:06+05:30 IST

ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబిలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ముంబై బౌలర్లు చెన్నై బ్యాట్స్‌మెన్స్‌కు...

రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. మళ్లీ ఎల్బీడబ్ల్యూనే..!

అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబిలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ముంబై బౌలర్లు చెన్నై బ్యాట్స్‌మెన్స్‌కు వరుస షాకులిస్తున్నారు. తొలి ఓవర్‌లో బౌల్ట్ బౌలింగ్‌లో చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మళ్లీ.. రెండో ఓవర్ చివరి బంతికి పట్టిన్సన్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ మురళీ విజయ్ కూడా ఎల్బీడబ్ల్యూ కావడంతో పెవిలియన్ బాట పట్టాడు.


దీంతో.. ఓపెనర్లు వాట్సన్(4), విజయ్(1) వికెట్లను కొద్దిపరుగులకే.. ఆదిలోనే కోల్పోయి చెన్నై జట్టు కష్టాల్లో పడింది. డుప్లెసిస్, అంబటి రాయుడు ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. చెన్నై ముందు 163 పరుగుల లక్ష్యం ఉండటం, ఇప్పటికే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోవడంతో చెన్నై జట్టు బ్యాటింగ్‌పై ఆసక్తి నెలకొంది.

Updated Date - 2020-09-20T03:34:06+05:30 IST