టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై.. ఆఫ్ స్నిన్నర్ను బరిలోకి దింపుతున్న ముంబై
ABN , First Publish Date - 2022-04-22T00:42:00+05:30 IST
ఐపీఎల్లో మరికాసేపట్లో మరో ఆసక్తికర పోటీ జరగనుంది. వరుస పరాజయాలతో అట్టడుగున ఉన్న
ముంబై: ఐపీఎల్లో మరికాసేపట్లో మరో ఆసక్తికర పోటీ జరగనుంది. వరుస పరాజయాలతో అట్టడుగున ఉన్న ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లకు ఇప్పటికే దాదాపు అవకాశాలు మూసుకుపోయాయి. రేసులో నిలవాలంటే మాత్రం ఇకపై ప్రతి మ్యాచ్లోనూ నెగ్గాల్సి ఉంటుంది. చెన్నై ఆరు మ్యాచ్లు ఆడి ఒక మ్యాచ్లో గెలిస్తే, ముంబై ఆడిన ఆరు మ్యాచుల్లోనూ ఓడింది. కాబట్టి రోహిత్ సేనకు ఇది చావోరేవో మ్యాచ్. మరోవైపు, చెన్నైది కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే. కాబట్టి విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.
చెన్నై జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. మొయిన్ అలీ, జోర్డాన్ స్థానాల్లో ప్రిటోరియస్, శాంట్నర్ తుది జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఇక, ముంబై మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆఫ్ స్పిన్నర్ హృతిక్ షాకీన్ ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అరంగేట్రం చేస్తున్నాడు. డేనియల్ శామ్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు.