ఐపీఎల్ అప్డేట్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
ABN , First Publish Date - 2020-09-20T00:45:40+05:30 IST
షేక్ జాయేద్ స్టేడియం వేదికగా మొదలైన ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి...
అబుదాబి: షేక్ జాయేద్ స్టేడియం వేదికగా మొదలైన ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. 2008లో సీజన్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యంత విజయవంతమైన జట్లుగా చెన్నై, ముంబై పేరు తెచ్చుకున్నాయి.
ధోనీ సారథ్యంలోని సీఎస్కే ఖాతాలో మూడు టైటిళ్లున్నాయి. అలాగే ఆడిన పది సీజన్లలో 8 సార్లు ఫైనల్ చేరిందంటే సీఎస్కే నిలకడ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈసారి ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారిన పడడం, రైనా.. హర్భజన్ దూరం కావడం వారిని ఆందోళన పరుస్తోంది. ఈ పరిస్థితులను మహీ ఎలా అధిగమిస్తాడన్నది ఆసక్తికరమే. ఇక నాలుగు టైటిళ్లతో టాప్లో ఉన్న ముంబై ఇండియన్స్ ఉరకలెత్తే ఉత్సాహంతో ఉంది. రోహిత్ శర్మ నేతృత్వం.. గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడం వారికి కలిసి రానుంది.