త్వరలో చెన్నై-పుదుచ్చేరి మధ్య నౌక రవాణా
ABN , First Publish Date - 2022-04-03T13:51:46+05:30 IST
చెన్నై-పుదుచ్చేరి మధ్య త్వరలో ప్రయాణికుల నౌక రవాణా ప్రారంభించనున్నామని, అలాగే చెన్నై-కన్నియాకుమారి మధ్య నౌక రవాణా ప్రారంభంపై
పెరంబూర్(చెన్నై): చెన్నై-పుదుచ్చేరి మధ్య త్వరలో ప్రయాణికుల నౌక రవాణా ప్రారంభించనున్నామని, అలాగే చెన్నై-కన్నియాకుమారి మధ్య నౌక రవాణా ప్రారంభంపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేస్తున్నామని చెన్నై, ఎన్నూర్ హార్బర్ల చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్పాలివాల్ తెలిపారు. నగరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఎన్నూర్ హార్బర్కు సంబంధించి 50 శాతం వాటాలు చెన్నై హార్బర్ కొనుగోలు చేసిందన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో చెన్నై హార్బర్ ఆదాయం రూ.826 కోట్లు ఉండగా, ఎన్నూర్ హార్బర్ ఆదాయం రూ.827 కోట్లు అని ఆయన తెలిపారు.