సబర్బన్ రైలు ఢీకొని ఇద్దరు యువకుల మృతి
ABN , First Publish Date - 2021-11-22T17:11:29+05:30 IST
రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలో సబర్బన్ రైలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. తక్కోలం ప్రాంతానికి చెందిన పార్థసారథి (30), సుకుమార్ (26)లు శనివారం రాత్రి సేందమంగళం రైలు గేట్ సమీపంలో
చెన్నై/పెరంబూర్: రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలో సబర్బన్ రైలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతిచెందారు. తక్కోలం ప్రాంతానికి చెందిన పార్థసారథి (30), సుకుమార్ (26)లు శనివారం రాత్రి సేందమంగళం రైలు గేట్ సమీపంలో రైలు పట్టాలు దాటేందుకు యత్నిస్తుం డగా, చెన్నై బీచ్ నుంచి అరక్కోణం వెళుతున్న సబర్బన్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో సుకుమార్ సంఘటనాస్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అం దుకున్న అరక్కోణం రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని తీవ్రగాయా లపాలైన పార్ధసారధిని అరక్కోణం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్సల అనంతరం చెన్నై ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.