అసోంలో భారీ వర్షాలు.. మట్టిచరియలు పడి సైనికుడి మృతి

ABN , First Publish Date - 2021-07-26T16:46:05+05:30 IST

అసోంలో భారీవర్షాల కారణంగా మట్టిచరియలు విరిగిపడిన ఘటనలో మదురైకి చెందిన సైనికుడు కదిర్‌వేల్‌ మృతిచెందాడు. మదురై విల్లాపురం

అసోంలో భారీ వర్షాలు.. మట్టిచరియలు పడి సైనికుడి మృతి

చెన్నై/పెరంబూర్‌: అసోంలో భారీవర్షాల కారణంగా మట్టిచరియలు విరిగిపడిన ఘటనలో మదురైకి చెందిన సైనికుడు కదిర్‌వేల్‌ మృతిచెందాడు. మదురై విల్లాపురం హౌసింగ్‌ బోర్డుకు చెందిన కదిర్‌వేల్‌ (36) రెండు రోజుల క్రితం అసోంలో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో భారీవర్షాలకు విరిగిపడిన కొండచరియల కింద చిక్కుకొని మృతిచెందాడు. అమరజవాను మృతదేహాన్ని వెలికితీసిన అధికారులు, ప్రత్యేక విమానంలో ఆదివారం రాత్రి మదురై విమానాశ్రయానికి, అక్కడి నుంచి వాహనంలో స్వగ్రామానికి తీసుకెళ్లారు. సైనిక లాంఛనాలతో సోమవారం ఉదయం మదురై శ్మశానవాటికలో కదిర్‌వేల్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2021-07-26T16:46:05+05:30 IST