పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చెన్నై ఎన్జీటి ధర్మాసనంలో విచారణ

ABN , First Publish Date - 2021-08-27T20:54:32+05:30 IST

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చెన్నై ఎన్జీటి ధర్మాసనంలో విచారణ జరిగింది. పర్యావరణ ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్ల విచారించారు.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చెన్నై ఎన్జీటి ధర్మాసనంలో విచారణ

 హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చెన్నై ఎన్జీటి ధర్మాసనంలో విచారణ జరిగింది. పర్యావరణ ఉల్లంఘనలపై దాఖలైన పిటిషన్ల విచారించారు. పర్యావరణ అనుమతులు లేకుండా చేపడుతున్నారని కోస్గి వెంకటయ్య దాఖలు చేసిన పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఇంప్లిడ్ అయింది. ప్రాజెక్టు వల్ల తమకు నష్టం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ప్రాజెక్టుపై తనిఖీ కమిటీ నివేదిక దాఖలు చేయకపోవడం పట్ల ఎన్జీటి అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిటీ నోడల్ ఏజెన్సీగా తెలంగాణ గనుల శాఖను తొలగించి కేఆర్ఎంబీని ఎన్జీటి నియమించింది. ప్రాజెక్టు నిర్మాణం, పర్యావరణ ఉల్లంఘనలపై కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇవ్వకపోవడం పట్ల ఎన్జీటి అభ్యంతరం వ్యక్తం చేసింది. త్వరగా పర్యావరణ ఉల్లంఘనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కి వాయిదా పడింది.

Updated Date - 2021-08-27T20:54:32+05:30 IST