చెన్నైలో 3.5 కిలోల గంజాయి స్వాధీనం
ABN , First Publish Date - 2021-12-06T17:58:03+05:30 IST
స్థానిక కొడుంగయూరు, తిరుమంగళం ప్రాంతాల్లో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ
చెన్నై/అడయార్: స్థానిక కొడుంగయూరు, తిరుమంగళం ప్రాంతాల్లో పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే, కొడుంగయూరు ఇన్స్పెక్టర్ జవహర్కు వచ్చిన సమాచారం మేరకు స్థానిక పార్వేందర్ బస్టాపు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో బాలాజీ (22) అనే యువకుడు ఎరుకంజేరికి చెందిన జయలక్ష్మి (50) అనే మహిళ వద్ద కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. అలాగే, అదే ప్రాంతానికి చెందిన ఓ హిజ్రా కూడా గంజా విక్రయం చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో జయలక్ష్మి, హిజ్రా కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలాజీ వద్ద 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, స్థానిక తిరుమగళం ఏరియాలో సురేష్ (30), దేవన్ (30) అనే ఇద్దరు వ్యక్తుల వద్ద 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.