Chennai: 340 కిలోల గంజాయి పట్టివేత...

ABN , First Publish Date - 2021-11-29T17:02:51+05:30 IST

నామక్కల్‌ జిల్లా ఎర్నాపురంలో అక్రమంగా తరలిస్తున్న 340 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ మార్గంలో వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారనే రహస్య సమా చారంతో

Chennai: 340 కిలోల గంజాయి పట్టివేత...

చెన్నై/పెరంబూర్: నామక్కల్‌ జిల్లా ఎర్నాపురంలో అక్రమంగా తరలిస్తున్న 340 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ మార్గంలో వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారనే రహస్య సమా చారంతో పోలీసులు ఆదివారం ఉదయం ఆ మార్గంలో గస్తీ పనులు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన కారును అడ్డుకొని తనిఖీ చేయగా, కారు సీట్ల కింద బస్తాల్లో ఉంచిన సుమారు రూ.1 కోటి విలువైన 340 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకొని, కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Updated Date - 2021-11-29T17:02:51+05:30 IST