Chennai: రోడ్డుపైనే మృతదేహానికి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-11-15T17:17:30+05:30 IST

శ్మశానానికి వెళ్లే రహదారి వంతెన ధ్వంసం కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ఆవేశం చెందిన ప్రజలు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడి మృతదేహాన్ని రోడ్డుపైనే దహనం చేసి ఆందోళన చేపట్టారు

Chennai: రోడ్డుపైనే మృతదేహానికి అంత్యక్రియలు

చెన్నై/ఐసిఎఫ్: శ్మశానానికి వెళ్లే రహదారి వంతెన ధ్వంసం కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ఆవేశం చెందిన ప్రజలు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడి మృతదేహాన్ని రోడ్డుపైనే దహనం చేసి ఆందోళన చేపట్టారు. అరియలూరు జిల్లా నక్కంపాడి కాలనీ వీధికి చెందిన శరవణన్‌ (30) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అంత్యక్రియ లు నిర్వహించేందుకు బంధువులు శ్మశా నానికి తీసుకెళ్లేందుకు నిర్ణయించగా, కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శ్మశానానికి వెళ్లే దారిలో నిర్మించిన కాంక్రీట్‌ వంతెన ధ్వంసమైంది. దీంతో పాటు రెండు వైపులా మట్టి కోత ఏర్పడి శ్మశానానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆవేశం చెందిన ప్రజలు శరవణన్‌ భౌతికదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి శ్మశానవాటికకు వెళ్లే రోడ్డుపై అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2021-11-15T17:17:30+05:30 IST