షాకింగ్.. భార్య‌, పిల్ల‌ల‌ను రంపంతో కోసి దారుణం.. ఆ త‌ర్వాత అత‌ను ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-05-29T21:49:25+05:30 IST

అత‌ను త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి తమిళనాడులోని చెన్నై సబర్బన్‌ పొలిచలూరులో నివ‌సిస్తున్నాడు..

షాకింగ్.. భార్య‌, పిల్ల‌ల‌ను రంపంతో కోసి దారుణం.. ఆ త‌ర్వాత అత‌ను ఏం చేశాడంటే..

అత‌ను త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి తమిళనాడులోని చెన్నై సబర్బన్‌ పొలిచలూరులో నివ‌సిస్తున్నాడు.. వ్యాపారం చేసే ఆ వ్య‌క్తి తీవ్ర న‌ష్టాల పాల‌య్యాడు.. అప్పులు తీర్చే మార్గం క‌నిపించ‌లేద‌దు.. ఈ క్రమంలో అత‌ను తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.. భార్యాపిల్ల‌ల‌ను అత్యంత దారుణంగా రంపం కోసే యంత్రంతో చంపేశాడు.. ఆ త‌ర్వాత అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.. స్థానికులు చూసే స‌రికి న‌లుగురూ త‌మ ఇంట్లో విగ‌త జీవులుగా ప‌డి ఉన్నారు.. చెన్నై సబర్బన్‌ పొలిచలూరులో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 


 పొలిచలూరులో నివ‌సిస్తున్న ప్రకాష్ (41) కి.. భార్య గాయత్రి (35), కుమారుడు హరికృష్ణన్ (11), కుమార్తె నిత్యశ్రీ (9) ఉన్నారు. ఆయుర్వేద మందుల షాపు పెట్టి న‌ష్ట‌పోయిన‌ ప్రకాష్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడు. అప్పులకు వ‌డ్డీలు పెరిగిపోవ‌డంతో వాటిని తీర్చ‌డం ప్ర‌కాష్ కు తలకు మంచిన భారంగా మారింది. ఈ క్ర‌మంలో భార్యాభ‌ర్త‌ల మధ్య త‌ర‌చుగా గొడవలు జరిగేవి. దీంతో ప్రకాష్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. రంపం కోసే యంత్రంతో భార్య, ఇద్ద‌రు పిల్లలను దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. 


స్థానికులు చూసే స‌రికి నలుగురూ తమ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్ట‌మ్ కు త‌ర‌లించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2022-05-29T21:49:25+05:30 IST