విరుల సోయగం
ABN , First Publish Date - 2022-06-04T13:18:00+05:30 IST
దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 99వ జయంతి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని కలైవానర్ అరంగంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ
- నగరంలో తొలిసారిగా పుష్ప ప్రదర్శన ప్రారంభం
చెన్నై, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 99వ జయంతి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని కలైవానర్ అరంగంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. డీఎంకే శాసనసభ్యుడు ఉదయనిధి ఈ ప్రదర్శన ప్రారంభించారు. ఊటీ, కొడైకెనాల్, ఏర్కాడు, బెంగళూరు, పూనే తదితర నగరాల నుంచి తెప్పించిన 128 రకాలకు చెందిన నాలుగు లక్షలకు పైగా పూలతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఊటీ, కొడైకెనాల్, ఏర్కాడు ప్రాంతాల్లో నిర్వహించే విధంగా భారీ యెత్తున ఏర్పాటైన ఈ పుష్ప ప్రదర్శన ఈ నెల ఐదో తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుందని ఎమ్మెల్యే ఉదయనిధి తెలిపారు. ఆయనతోపాటు ఎంపీ దయానిధి మారన్, మంత్రులు ఎంఆర్కే పన్నీర్సెల్వం, ఎం. సుబ్రమణ్యం సందర్శించారు.