Chennaiలో 94 యేళ్ళ బామ్మ పోటీ
ABN , First Publish Date - 2022-02-05T16:12:52+05:30 IST
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కు జరుగనున్న ఎన్నికల్లో 94 యేళ్ల బామ్మ పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 174వ వార్డులో బీసెంట్నగర్ మైఖేల్ కాలనీకి చెందిన కామాక్షి (94) స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆ
చెన్నై: గ్రేటర్ చెన్నై కార్పొరేషన్కు జరుగనున్న ఎన్నికల్లో 94 యేళ్ల బామ్మ పోటీ చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 174వ వార్డులో బీసెంట్నగర్ మైఖేల్ కాలనీకి చెందిన కామాక్షి (94) స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆ బామ్మ ఎవరి సాయం లేకుండా వార్డు ఎన్నికల కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ పత్రాన్ని, ఆస్తుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్ను సమర్పించారు. తనకు రూ.91.61 లక్షల విలువైన ఆస్తులున్నట్లు ఆమె అందులో పేర్కొన్నారు.