చెన్నైకు ఏపీ, తెలంగాణ సహకారం.. 5 టీఎంసీల నీరు కేటాయింపు

ABN , First Publish Date - 2021-12-24T00:52:37+05:30 IST

తాగునీటి కోసం 5 టీఎంసీల నీరు కేటాయింపునకు తెలంగాణ, ఏపీ సమ్మతించాయి. 10 టీఎంసీల నీటి విడుదలపై...

చెన్నైకు ఏపీ, తెలంగాణ సహకారం.. 5 టీఎంసీల నీరు కేటాయింపు

చెన్నై: తాగునీటి కోసం 5 టీఎంసీల నీరు కేటాయింపునకు తెలంగాణ, ఏపీ సమ్మతించాయి. 10 టీఎంసీల నీటి విడుదలపై మహారాష్ట్ర, కర్ణాటక స్పష్టత ఇవ్వలేదు. ఈ సంవత్సరం తమిళనాడుకు భారీ వరదలు రావడంతో నీటి సమస్య పెద్దగా తలెత్తలేదు. ఇప్పటికే చెన్నై తాగునీటి కోసం తెలంగాణ నీరు విడుదల చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగతా నీటిని చెన్నైకి విడుదల చేసే బాధ్యత ఏపీదేనని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ సూచనకు ఏపీ ఒప్పుకుంది. ఇప్పటి వరకు ఐదున్నర టీఎంసీలను చెన్నై వాడుకుంది. కేఆర్ఎంబీలోని చెన్నై నీటి కేటాయింపుల కమిటీలో ఉండలేమని కర్ణాటక, మహారాష్ట్ర పేర్కొంది. 

Updated Date - 2021-12-24T00:52:37+05:30 IST