Airportలో 470 గ్రాముల Gold స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-24T13:48:17+05:30 IST

దుబాయ్‌ నుంచి చెన్నైకు వచ్చిన ఇండిగో ఎయర్‌లైన్స్‌ విమానంలో సీటు అడుగు భాగంలో అక్రమంగా భద్రపరిచి తీసుకొచ్చిన 470 గ్రాముల బంగారాన్ని ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 138 మంది

Airportలో 470 గ్రాముల Gold స్వాధీనం

అడయార్‌(Chennai): దుబాయ్‌ నుంచి చెన్నైకు వచ్చిన ఇండిగో ఎయర్‌లైన్స్‌ విమానంలో సీటు అడుగు భాగంలో అక్రమంగా భద్రపరిచి తీసుకొచ్చిన 470 గ్రాముల బంగారాన్ని ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 138 మంది ప్రయాణికులతో శనివారం వేకువజామున ఈ విమానం చెన్నైకు వచ్చింది. ఇక్కడ నుంచి ఈ విమానం హైదరాబాద్‌కు డొమెస్టిక్‌ విమానంగా వెళ్ళాల్సి ఉంది. దీంతో విమానాన్ని సిబ్బంది శుభ్రం చేసే చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఒక సీటు అడుగు భాగంలో భద్రపరిచిన బంగారాన్ని గుర్తించారు. 


Updated Date - 2021-10-24T13:48:17+05:30 IST