స్వతంత్ర అభ్యర్థి అదృశ్యం ..పోలీసులకు అతని భార్య ఫిర్యాదు..!
ABN , First Publish Date - 2022-02-21T17:30:51+05:30 IST
ఈరోడ్ జిల్లా నంబియూరు పట్టణ పంచాయతీ 5వ వార్డులో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళన చెందిన
చెన్నై/అడయార్: ఈరోడ్ జిల్లా నంబియూరు పట్టణ పంచాయతీ 5వ వార్డులో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. దీంతో ఆందోళన చెందిన ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 19న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నంబియూరు రంగనాథపురానికి చెందిన మురుగేశన్ (47) నంబియూరు పట్టణ పంచాయతీ 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, శనివారం పోలింగ్ తర్వాత ఆయన ఇంటికి చేరలేదు.. దీంతో ఆందోళన చెందిన ఆయన భార్య నంబియూర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదుచేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్వతంత్ర అభ్యర్థి కోసం గాలిస్తున్నారు.