ఇళయరాజా ఆరోపణలు సరికాదు: ద్రవిడదేశం పార్టీ అధినేత
ABN , First Publish Date - 2020-08-02T15:16:44+05:30 IST
ఇళయరాజా ఆరోపణలు సరికాదు: ద్రవిడదేశం పార్టీ అధినేత
చెన్నై: తమిళనాడులో తెలుగువారిపై దాడులు పెరుగుతున్నాయని ద్రవిడదేశం పార్టీ అధినేత కృష్ణారావు తెలిపారు. సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా తెలుగు సినీ ప్రముఖులపై వరస ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రసాద్ స్టూడియోలో పాటల రికార్డింగ్ కోసం తాత్కాలికంగా ఎల్.వి.ప్రసాద్ రూం కేటాయిస్తే ఖాళీ చేయనని అనడం సమంజసం కాదని పేర్కొన్నారు. తెలుగు, తమిళ సినీ ప్రముఖులు తెలుగువారిపై దాడుల పరంపరకి అడ్డుకట్టవేయాలని కృష్ణారావు కోరారు.