Chennai: ఆగస్టు నుంచి విమాన చార్జీల తగ్గింపు
ABN , First Publish Date - 2021-07-19T18:22:04+05:30 IST
కరోనా లాక్డౌన్ కార ణంగా గత కొద్ది మాసాలుగా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోవటంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో
చెన్నైః కరోనా లాక్డౌన్ కార ణంగా గత కొద్ది మాసాలుగా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోవటంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో చెన్నై నుంచి హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాలకు నడిచే విమానాల్లో ఆగస్టు ఒకటి నుండి ఛార్జీలను తగ్గించనున్న ట్లు విమాన సంస్థల నిర్వా హకులు ప్రకటించారు. ఆ మేరకు చెన్నై నుంచి హైదరాబాద్కు రూ.1300లు ఛార్జీగా నిర్ణయించారు. ఇదే విధంగా చెన్నై నుంచి ఢిల్లీ, ముంబా యి నగరాలకు రూ.2300లు, రూ.1700లుగా తగ్గించారు.