రాజరాజేశ్వరిగా చెంగాళమ్మ
ABN , First Publish Date - 2022-10-05T06:37:13+05:30 IST
శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి మంగళవారం రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు.
సూళ్లూరుపేట, అక్టోబరు 4: శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా సూళ్లూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరి మంగళవారం రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం అమ్మణ్ణికి అభిషేకం, విశేష పూజలు చేశారు.అనంతరం మహా చండీయాగాన్ని నిర్వహించారు. ఉభయకర్తలుగా అట్రంబాకం దొరైరెడ్డి, సుహాసిని దంపతులు వ్యవహరించారు. అలంకరణ ఉభయకర్తలుగా నెల్లూరుకు చెందిన ముద్దలూరు మురళీకృష్ణ,అనిత దంపతులు వ్యవహరించారు.అమ్మవారికి సారెను పోలీసులు సమర్పించారు.ఎ్సఐ రవి బాబు ఆఽధ్వర్యంలో పోలీసు సిబ్బంధి మేళతాళాల నడుమ వీరజాటీతాళ్ల విన్యాసాలతో సారెను తీసుకొచ్చారు.రాజగోపుర ద్వారం వద్ద సారెకు ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు.ఆలయ ఛైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాస రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.