భవ్యాస్‌ అధినేత ఆనంద్‌ప్రసాద్‌పై చీటింగ్‌ కేసు

ABN , First Publish Date - 2021-03-28T15:10:55+05:30 IST

భవ్యాస్‌ కన్‌స్ట్రక్షన్‌, సినీ నిర్మాత వెనిగండ్ల ఆనంద్‌ప్రసాద్

భవ్యాస్‌ అధినేత ఆనంద్‌ప్రసాద్‌పై చీటింగ్‌ కేసు

హైదరాబాద్/రామచంద్రాపురం : భవ్యాస్‌ కన్‌స్ట్రక్షన్‌, సినీ నిర్మాత వెనిగండ్ల ఆనంద్‌ప్రసాద్‌, అతడి కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వామిపై రామచంద్రాపురం పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. శనివారం ఆనంద్‌ప్రసాద్‌ కుమారుడు ఆదిత్య, వ్యాపార భాగస్వామి పోకల శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆనంద్‌ప్రసాద్‌ ఇతర కుటుంబసభ్యులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. 2017లో ఆనంద్‌ప్రసాద్‌ తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే ప్రతి 6 నెలలకు 4 శాతం లాభాలు ఇస్తామని జూపల్లి సత్యనారాయణ అనే వ్యక్తికి ఆఫర్‌ ఇచ్చారు.


సత్యనారాయణ ఆనంద్‌ ప్రసాద్‌ సంస్థలో కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆనంద్‌ప్రసాద్‌ సత్యనారాయణకు 4 శాతం లాభాలు చెల్లించలేదు. దీంతో సత్యనారాయణ తన పెట్టుబడి కోటి రూపాయలు తిరిగి చెల్లించాలని ఆనంద్‌ప్రసాద్‌ను కోరాడు. దీంతో ఆనంద్‌ప్రసాద్‌ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటూ సత్యనారాయణ రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం శివకుమార్‌, ఆదిత్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆనంద్‌ ప్రసాద్‌ ఆయన కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2021-03-28T15:10:55+05:30 IST