అచ్చెన్న నియామకంపై హర్షాతిరేకాలు

ABN , First Publish Date - 2020-10-20T08:17:49+05:30 IST

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును పలువురు నేతలు, కార్యకర్తలు కలిసి అభినందించారు. సోమవారం నిమ్మాడలోని ఆయన

అచ్చెన్న నియామకంపై హర్షాతిరేకాలు

 టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడికి అభినందనల వెల్లువ

కోటబొమ్మాళి, అక్టోబరు 19: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును పలువురు నేతలు, కార్యకర్తలు కలిసి అభినందించారు. సోమవారం నిమ్మాడలోని ఆయన క్యాంపు కార్యాలయానికి పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి అభినందలనతో ముంచెత్తారు. మిఠాయిలు పంచిపెట్టారు. టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌, జడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ, శిమ్మ పాపారావు, హనుమంతు అప్పారావు, గిండు లక్ష్మణరావు తదితరులు కలిసి పూలమాలలు వేసి అభినందించారు. ఫ పాతపట్నం:


టీడీపీ రాష్ట్ర నూత న అధ్యక్షుడిగా నియమితులైన అచ్చెన్నాయుడును మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి కలిసి అభినందించారు. అచ్చెన్నాయుడును నియమించి జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నా యుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట నాయకులు కల మట సాగర్‌బాబు, బైరాగి నాయుడు, పైల లచ్చుమయ్య ఉన్నారు. ఫ మెళియాపుట్టి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును, పార్టీ జాతీ య ప్రధానకార్యదర్శిగా ఎంపీ రామ్మోహన్‌ నాయుడును నియమించడంపై మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేసిన వారిలె బసవ భాస్కరరెడ్డి, పరమేష్‌ రెడ్డి, భాస్కర్‌గౌడో, బి.లలితకుమారి, సయిథ్‌ సిలార్‌ తదితరులున్నారు. 

 సంతబొమ్మాళి: టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై టీడీపీ మండల నాయకులు ఎల్‌ఎల్‌ నాయుడు, జీరు భీమారావు, లమ్మత లక్ష్మి, సూరాడ ధన రాజ్‌, బుచ్చ మురళీకృష్ణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. బాబాయి, అబ్బాయి నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఫ నందిగాం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా టెక్కలి ఎమ్మెల్యే కింజరా పు అచ్చెన్నాయుడును నియమించడంపై నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు పి.అజయ్‌కుమార్‌, నాయ కులు ఎం.బాలకృష్ణ, పి.చంద్రశేఖర్‌, కె.ప్రసాదరావు, ఎం.లోకనాథం, మోహ నరావు, సింహాచలం తదితరులు అచ్చె న్నాయుడును కలిసి అభినందించారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయు డును నియమించినందుకు వారు హర్షం తెలిపారు. వీరి నేతృత్వంలో జిల్లా లో పార్టీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 

 గార: టీడీపీ రాష్ట్ర  అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు నియామకం పై నాయకులు పార్టీ హర్షం వ్యక్తం చేశారు. అచ్చెన్న నాయకత్వంలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని మండల సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు పొట్నూరు కృష్ణమూర్తి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పీస వెంకటరమణమూర్తి, గార ఎంపీటీసీ మాజీ సభ్యుడు జల్లు రాజీవ్‌ అన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో పార్టీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీరమణమూర్తి, బడగల వెంకటప్పారావు, టి.అప్పలనాయుడు, సంధ్యయ్య, కైబాడి రాజు, గోర సురేష్‌, కోరాడ వెంకట్రావు, మైగాపు ప్రభాకరరావు, వీఎస్‌గిరి ఉన్నారు.

 


Updated Date - 2020-10-20T08:17:49+05:30 IST